Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఢిల్లీ ప్రిన్స్పల్ బెంచ్ విచారిస్తుందని చెన్నై బెంచ్ తెలిపింది. నిబంధనలు అతిక్రమించి కాళేశ్వరం పనులు చేపడుతున్నందున వాటిని నిలిపివేయాలని కోరుతూ వేములఘాట్ భూనిర్వాసితుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఎన్జీటీ చెన్నై బెంచ్ జులై 22న విచారించింది. కాళేశ్వరం అనుమతులపై ఇప్పటికే ఢిల్లీలోని ఎన్జీటీ ప్రధాన బెంచ్లో విచారణ సాగుతోందని, ఒకే అంశంపై రెండు బెంచ్ల్లొ విచారణ సరికాదని నాడు తెలంగాణ ప్రభుత్వం అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్రావు ధర్మాసనం దష్టికి తీసుకువెళ్లారు. ప్రధాన బెంచ్లోని కేసుకు ప్రస్తుత కేసుకు సంబంధం లేదని, పిటిషన్ను ప్రధాన బెంచ్కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ పిటిషన్ విచారణపై స్పష్టత ఇవ్వాలని జస్టిస్ రామకష్ణన్ నాడు ప్రధాన బెంచ్కు విన్నవించారు. పిటిషన్ విచారణపై జస్టిస్ రామకష్ణన్ నేతత్వంలోని ధర్మాసనం బుధవారం స్పష్టతనిచ్చింది. పిటిషన్ను విచారిస్తామని దిల్లీలోని ప్రధాన బెంచ్ స్పష్టం చేసినందున విచారణను ప్రధాన బెంచ్కు బదిలీ చేసినట్లు జస్టిస్ రామకష్ణన్ తెలిపారు. ఈ నెల 31న ఎన్జీటీ ప్రధాన బెంచ్ రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది.