Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో హోటళ్ళ వ్యాపారంలో 43.5 శాతం క్షీణత చోటు చేసుకుందని జెఎల్ఎల్ అంచనా వేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే భారీ నష్టమని జెఎల్ఎల్ తన హోటల్ మొమెంటమ్ ఇండియా రిపోర్ట్లో పేర్కొంది. దేశంలోని 11 కీలక నగరాల్లోని ఆ రంగ సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొంది. దీని ప్రకారం గడిచిన త్రైమాసికంలో ముంబయి, రెవెన్యూ పరంగా గోవాలో అత్యధికంగా వరుసగా 81 శాతం, 93.5 శాతం చొప్పున పతనం చోటు చేసుకుంది. కోల్కత్తాలో 88.9 శాతం, బెంగళూరు 88.5 శాతం, అహ్మాదాబాద్ 85.5 శాతం చొప్పున వ్యాపారాన్ని కోల్పోయాయి.