Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్లు
అయోధ్యలో భారత ప్రధాని నిర్వహించిన 'భూమి పూజ' ద్వారా భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. భూమి పూజను జాతీయ సంస్థ అయిన దూరదర్శన్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సిపిఎం పొలిట్బ్యూరో మంగళవారం వ్యక్తం చేసిన ప్రధాన ఆందోళనలను నిజం చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం చేసిన వరుస ట్వీట్లు ఇలా ఉన్నాయి.
- గవర్నర్ సమక్షంలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని రాష్ట్రం స్వాధీనం చేసుకుంది. భారత రిపబ్లిక్లోని లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని యుపి సిఎం తిరస్కరించారు.
- ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణాన్ని చేయాలనే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారు.
- బాబ్రీ మసీదు ధ్వంసాన్ని చట్టబద్ధం చేయాలనే ఆలోచనను మరొకసారి ఈ 'భూమి పూజ' గుర్తు చేసింది.
- పక్షపాత, రాజకీయ ప్రయోజనాలు కోసం ప్రజల మత విశ్వాసాలను ఈ భూమి పూజతో నగంగా దోపిడీ చేశారు. భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని నిర్భయంగా ఉల్లంఘించారు.
- మత కార్యక్రమాలను నిషేధిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన కోవిడ్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడం ఈ కార్యక్రమం ప్రసారం నిరూపించింది.
- ప్రతి పౌరుడి విశ్వాసానికి చట్టం రక్షణ కల్పిస్తుందని రాజ్యాంగం హామీ ఇచ్చింది. ప్రతి పౌరుడి ఎంపికకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. రాజ్యానికి మతం లేదు.