Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది మృతి శ్రీ 11 మంది ఆచూకీ కోసం గాలింపు
పాట్నా : బీహార్లో రెండు వేర్వేరు పడవబోల్తా ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటనలు జరిగాయి. రాష్ట్రంలోని ఖగారియా, సాహర్సా జిల్లాల్లోని గండక్, కోశి నదుల్లో పడవలు మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (ఎస్డిఆర్ఎఫ్), స్థానిక ఈతగాళ్లు సంయుక్తంగా బుధవారం గాలింపు చర్యలు చేపట్టారని ఇరు జిల్లాల ఉన్నతాధికారులు వెల్లడించారు. గండక్ నది నుంచి నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా పది మంది మృతదేహాలను వెలికి తీయగా, కోశి నది నుంచి రెండు మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. ఈ ఘటనలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.