Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిపుణుల అంచనా
- నేడు ఆర్బిఐ నిర్ణయం వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు దేశ ఆర్ధిక వ్యవస్థ సన్నగిల్లడంతో మార్కెట్లో నగదు లభ్యతను పెంచడానికి ఆర్బిఐ ప్రాధాన్యతనివొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 4న ప్రారంభమైన ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీ 6న ముగియనుంది. సమావేశం వివరాలను గురువారం ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించనున్నారు. కాగా ఈ సమీక్షలో వడ్డీ రేట్ల మార్పునపై బ్లూమ్బర్గ్ 42 మంది నిపుణులతో ఓ సర్వే చేసింది. ఇందులో 21 మంది ఆర్ధిక నిపుణులు కీలక వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అంచనా వేశారు. ఒక్కరు మాత్రం ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గొంచే అవకాశం ఉందన్నారు. మిగితా వారు ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆర్బిఐ కీలక వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపోరేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇది 2000 ఏడాది కనిష్ట స్థాయి. కాగా దేశంలో గత రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని.. ఈ క్రమంలో ఆర్బిఐ ధరల నియంత్రణపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని హెచ్ఎస్బిసి హోల్డింగ్స్ ఎకనామిస్ట్ ప్రజుల్ భండారి పేర్కొన్నారు.