Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డొచ్చిన కుమారుడ్ని ఇష్టమొచ్చినట్టు బాదిన పెత్తందార్లు
గాంధీనగర్ : గుజరాత్ రాజధాని గాంధీనగర్కు కూతవేటులో దళిత మహిళపై కొంతమంది పెత్తందార్లు అమానుషంగా దాడిశారు. అడ్డొచ్చిన ఆమె కుమారుడ్ని సైతం ఇష్టమొచ్చినట్టు కొట్టారు. మాన్సా తాలూకా రంగాపూర్ గ్రామంలో ఆగస్టు 2న, 3న ఈ దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. తమ ఇంటిముందు పడివున్న జంతు కళేబరాల్ని తీసేయాల్సిందిగా పెత్తందార్లు ఒత్తిడి చేయగా అందుకు దళిత మహిళ రంజన్ పార్మర్(55), ఆమె కుమారుడు కుల్దీప్ పార్మర్లు తిరస్కరించారు. దాంతో వారిపై పలుమార్లు దాడిచేసి...తీవ్రంగా కొట్టారు. ప్రధాన నిందితుడు సురేశ్ సిన్హా చావ్డా రాత్రిపూట తాగొచ్చి దళితుల ఇంటిముందు నానా రభస చేశాడని, ఇష్టమొచ్చినట్టు కులం పేరుతో దూషించాడని రంజన్ పార్మర్ పోలీసులకు తెలిపాడు. ఈ దాడి ఘటనకు సంబంధించి చావ్డాపై స్థానిక పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. అయితే పోలీసు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గ్రామం నుంచి చావ్డా తప్పించుకొని పారిపోయాడు. పెత్తందారు అయిన సురేశ్ సిన్హా చావ్డా అప్పటికే ఒక అక్రమ మద్యం కేసులో అరెస్టు అయ్యి, బెయిల్పై ఉన్నాడు. అట్రాసిటీ కేసులో చావ్డాకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదుచేశామని, త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.