Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా గిరీష్ చంద్ర ముర్ము శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఆయనతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాగ్ కార్యాలయంలో ఉన్న మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాల వద్ద ముర్ము నివాళులర్పించారు. ఆయన ఇంతకుముందు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరించారు.