Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వ్యూహాత్మక దెప్సాంగ్ మైదానాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు దౌలత్ బేగ్ ఓల్డీ(డిబిఓ) వద్ద మేజర్ జనరల్ స్థాయిలో భారత్, చైనాల మధ్య శనివారం చర్చలు జరిగినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇరుదేశాలకు చెందిన అధికారుల మధ్య ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో చర్చలు దెప్సాంగ్ వరకు మాత్రమే పరిమితం అయ్యాయని, పరస్పరం పెట్రోలింగ్ నిలుపుదలకు సంబంధించి చర్చించినట్లు పేర్కొన్నాయి. తూర్పు లఢక్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాన్గోంగ్ త్సో వివాదంతో పాటు ఈ దెప్సాంగ్ మైదానాల మధ్య కూడా భారత్, చైనాల మధ్య కీలకంగా ఉంది. జూన్ 15న గాల్వన్ లోయ వద్ద రెండు దేశాల జవాన్ల మధ్య ఘర్షణ అనంతరం మేజర్ జనరల్ స్థాయిలో జరిగిన మొదటి సమావేశం కావడం గమనార్హం. ఇప్పటి వరకూ కార్ప కమాండర్ స్థాయికి మాత్రమే పరిమితమై ఐదు సార్లు సైనిక అధికారుల సమావేవం జరిగింది.