Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షిప్ట్ ఆపరేటర్ పోస్టుకు 5 నుంచి 10 లక్షలు అది కూడా అధికార పార్టీ చేప్పిన వారికే
అమరావతి : విద్యుత్ సబ్స్టేషన్లలోని షిప్ట్ ఆపరేటర్ల నియమాకాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుటోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి, విద్యుత్ సబ్స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్ల ఖాళీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోవాలని జిల్లాస్థాయి అధికారులకు విద్యుత్ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నిబంధన అధికార పార్టీ నాయకులకు కలిసొచ్చింది. స్థానికంగా నియమకాలు చేసుకోమనడంతో అనేక చోట్ల ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు కుమ్మక్కయినట్టు సమాచారం. రాష్ట్ర కేంద్రాని అందిన సమాచారం మేరకు గుంటూరు, నెల్లూరు, చిత్తూరుల్లో ఈ తరహా నియమాకాలు పెద్ద ఎత్తున జరిగాయి. మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి పైరవీలకే తెరలేపారు. రాజకీయ పైరవీల గురించి డిస్కాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఉన్నవారిని తొలగించి మరీ కొత్తవారిని నియమిస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఇటీవల గుంటూరు జిల్లాలోని మాచర్ల సబ్స్టేషన్లో చోటుచేసుకుంది. సుమారు 30 మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని అధికారులు నియమించారు. తొలగించిన ఉద్యోగులు ట్రాన్స్కో జెఎమ్డికి దృష్టికి తీసుకురావడంతో దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది. షిప్ట్ ఆపరేటర్ల నియమకాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు జోక్యం చేసుకోవద్దని మంత్రివర్గ సమావేశంలో సిఎం చెప్పినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు లెక్కచేయలేదు.
పారదర్శకంగా భర్తీ చేయాలి
షిప్ట్ ఆపరేటర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి. లంచాలు తీసుకొని నియమకాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేక ిస్తున్నాం. ప్రభుత్వం పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి నిర్ధిష్ట ఎంపిక విధానం మేరకు నియమాకాలు చేయాలి. అప్పుడే ప్రభుత్వం నిజాయాతీగా వ్యవహరిం చినట్టు అవుతుంది. విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న అవినీతిపై సిఎం జోక్యం చేసుకొని అరికట్టాలి. సిపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ పరిధిలో ఏళ్లతరబడి పనిచేస్తున్న వాచ్మెన్లలో అర్హత ఉన్నవారిని షిప్ట్ ఆపరేటర్లుగా నియమించాలి ఎం.బాలకాశి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి