Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం
గుంటూరు : 1992లో ఏర్పాటు చేసిన ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రద్దు చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన నూతన జౌళి విధానం చేనేత పరిశ్రమ మనుగడకు కష్టమని చేనేత వర్గం ఆందోళనలు నిర్వహించిందని తెలిపారు. చేనేత సమస్యలు పరిష్కారానికి ఒక బోర్డు అవసరమనే పోరాటాల నేపథ్యంలో 1992లో అఖిల భారత చేనేత బోర్డు ఏర్పాటు చేశారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల వారిని సభ్యులుగా తీసుకుని బోర్డు నడుపుతున్నారని తెలిపారు. వారు తమ రాష్ట్రాల్లోని చేనేత సమస్యలను బోర్డు సమావేశంలో చర్చించి పరిష్కారానికి కషి చేసేవారని పేర్కొన్నారు. ఇప్పుడు బోర్డు రద్దుతో చేనేత సమస్యల చర్చకు అవకాశం లేకుండా పోయిందన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చాక తమిళనా డులో ఆర్భాటంగా నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చేనేత పరిశ్ర మ రక్షణకు కట్టుబడి ఉన్నామని మోడి ప్రకటించారని తెలిపారు. కానీ, ఆచర ణలో తన మంత్రి వర్గం, తన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న పవర్లూమ్ యజమానులకు రూ.వేలకోట్లు రాయితీలు ఇవ్వటమేకాక చేనేతకు సమాధి కట్టడం కోసమే ఆలిండియా బోర్డు రద్దు అని విమర్శించారు.
కనుండి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రాష్ట్రాలు వ్యవహరించాలి తప్ప రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకొనే అవకాశం ఉండదని తెలిపారు. చేనేత రక్షణకోసం ఆలిండియా బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.