Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశోక్ గజపతిరాజు
విజయనగరం: అమరావతిని డౌన్గ్రేడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. శనివారం ఆయన తన బంగ్లాలో విలేకరులతో మాట్లాడుతూ ఏ నగరం అభివృద్ధి అయినా మౌలిక రంగంపై ఆధారపడి ఉంటుందన్నారు. అమరావతిలో గ్రీన్ అండ్ బ్లూ క్యాపిటల్తో వాణిజ్యం, వర్తకం పెరగాలని గత టిడిపి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖకు మోడరన్ ఎయిర్పోర్టు ఉండాలని భోగాపురంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు అప్పట్లో తలపెట్టామన్నారు.
ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ 500 ఎకరాలు తగ్గించాలని నిర్ణయించడం తగదన్నారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాలింగ్ తగ్గిస్తే ఉద్యోగాలు తగ్గిపోతాయని, కార్గో తగ్గిస్తే వాణిజ్యం దెబ్బతింటుందని, రన్ వే లెంగ్త్ తగ్గిస్తే ప్రజల జీవితాలతో ఆడుకోవడమేనని పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టునైనా 900 ఎకరాల్లో పనులు పూర్తి చేసి నైట్ ల్యాండింగ్ అయ్యేటట్లు, అక్కడ కార్గో డెవలప్ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్పోర్టు క్రిటికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆడుకోవడం సరికాదని హెచ్చరించారు. కోజికోడ్లో ఘోర విమాన ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు.