Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, వ్యవసాయ, రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం మద్దతు తెలిపింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండిమెడ క్రాంతికుమార్ శనివారం ప్రకటన విడుదల చేశారు. కరోనాతో పస్తులుంటున్న పేదవారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం గుళ్లు, గోపురాలు కట్టిస్తూ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో అల్లాడుతున్న ప్రజల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులే నిలువెత్తు సాక్ష్యం అని తెలిపారు.