Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోంలో ఆందోళనలు
న్యూఢిల్లీ : అసోంలో 'సీఏఏ' చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిల్ గొగోరుకు 'ఎన్ఐఏ' ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గొగోరు తరఫు న్యాయవాదులు గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. ముఖ్యంగా అఖిల్ గొగోరు నేతృత్వంలోని పలు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే అఖిల్ గొగోరును లక్ష్యంగా చేసుకున్న అసోంలోని బీజేపీ ప్రభుత్వం అతడిపై 12 కేసుల్ని నమోదుచేసింది. దేశద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు..అనే ఆరోపణల కింద నిర్బంధించింది. ప్రస్తుతం రెండు కేసులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతున్నది. చౌబా పోలీస్స్టేషన్లో గొగోరుపై పలు ఆరోపణలు నమోదుచేశారు. వీటికి సంబంధించి గౌహతి హైకోర్టు జులై 16న గొగోరుకు బెయిల్ మంజూరుచేసింది. మరోవైపు ప్రజా సంఘాలు, మేధావులు అఖిల్ గొగోరు విడుదలకు డిమాండ్ చేస్తున్నారు. గొగోరును విడుదల చేయాలని గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు సైతం జరిగాయి.