Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థపై కఠిన చర్యలకు పోలీసులకు ఆదేశాలు
- జిల్లా ఎస్పీకి తెలియకుండానే ఆర్డర్లు జారీ
భోపాల్: దళిత సంస్థ భీం ఆర్మీపై మధ్యప్రదేశ్ సర్కారు కక్షగట్టింది. రాష్ట్రంలో రాబోయే ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి రాజకీయంగా కాకుండా అధికార బలాన్ని ఉపయోగించి అడ్డదారులు తొక్కుతున్నది. ఆ సంస్థ కార్యకలాపాలపై దృష్టిని సారించి, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర పోలీసులకు శివరాజ్సింగ్ చౌహాన్ సర్కారు నుంచి ఆదేశాలు అందాయి. దీంతో గ్వాలియర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ జిల్లా ఎస్పీ పేరు మీద ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంస్థ కార్యకలాపాలపై కన్నేసి ఉంచాలనీ, అలాంటి చర్యలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే తన కార్యాలయం నుంచి ఆర్డర్ జారీ అయిన విషయం వాస్తవమేననీ, అయితే దాని గురించిన సమాచారం గురించి తనకు తెలియదని ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. దీని గురించి తాను సోషల్ మీడియాద్వారా మాత్రమే తెలుసుకున్నానని తెలిపారు. తన కిందిస్థాయి అధికారి ద్వారా ఈ పొరపాటు జరిగిందనీ, దీనిపై తాను చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు.