Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారంతో 235వ రోజుకు చేరాయి. మందడంలో వైసిపి ఎంఎల్ఎలు రాష్ట్రానికి పట్టిన గ్రహణంగా అభివర్ణిస్తూ 151 బొమ్మలతో నిరసన తెలిపారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తుళ్లూరు దీక్షా శిబిరంలో మాట్లాడారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి, అధికార పక్షం టిడిపి, కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి అంగీకరించాయని, ఆ కారణంతోనే రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని అన్నారు.
అధికారం శాశ్వతం కాదన్న సంగతిని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గ్రహించి రాజధానిగా అమరావతిని కొనసాగించా లన్నారు. న్యాయం రైతుల పక్షాన ఉందని, అధైర్య పడొద్దని తెలిపారు. తుళ్లూరు, పెదపరిమి, మల్కాపురం, వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, వెంకటపాలెం, మందడం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు రాష్ట్ర ఏకైక రాజ ధానిగా అమరావతినే కొనసాగించాలంటూ దీక్షా శిబిరాలలో ఆందోళన జరిపారు. గత ప్రభుత్వంలో తలపెట్టిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించకుండా, ఇంతవరకు కౌలు చెల్లించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోం దని రైతులు మండిపడ్డారు. న్యాయపరంగా తుదికంటా పోరాడతామని పునరుద్గాటించారు.
రాజధానిలో పెండింగ్ పనులు
పూర్తి చేయాలి : సీపీఎం
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిం చడంతో పాటు రాజధానిలో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ శనివారం రాజధాని ప్రాంతం, మందడంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ రాజధాని రైతు లకు కౌలు,పేదలకు అమరావతి సామాజిక పింఛను రూ.5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.