Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్తో కోట్లాది మంది రోడ్డునపడ్డారు
- మోడీ సర్కార్ తీరుపై ఆగ్రహం
-'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వేలో వెల్లడి
- నిరుద్యోగం, వలసలు, ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లభించిన సమయాన్ని మోడీ సర్కార్ సద్వినియోగం చేసుకోలేకపోయిందా? వైరస్ బారినపడకుండా ప్రజల్ని కాపాడలేకపోయిందా ? అంటే...అవుననే సమాధానం వస్తోంది. 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వేలో... కరోనా కట్టడిలో పలువురు మోడీ సర్కార్ విఫలమైందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగం(23శాతం), వలసదారుల సంక్షోభం(14శాతం), నిత్యావసర సరుకుల ధరలు(11శాతం)... నియంత్రించటంలో కేంద్రం వైఫల్యం చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇండియా టుడే-కార్వీ ఇన్సైట్' సంయుక్తంగా నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వే చేపట్టగా ప్రజలు మోడీ సర్కార్తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కోవిడ్-19 కట్టడిలో కేంద్రం విఫలమైందని చెప్పారు. ఈ సర్వేలో వెల్లడైన మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి...కఠినమైన లాక్డౌన్ వల్ల దేశం ఎంతో నష్టపోయింది. కోట్లాది మంది వలస కార్మికులు రోడ్డునపడ్డారు. ప్రజలంతా ఇంటికే పరిమితమై ప్రభుత్వాలకు సహకరించారు. కానీ ఏం లాభం? కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. కోవిడ్-19 బాధితుల సంఖ్య 20లక్షలు దాటి...ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలోకి వెళ్లింది. భారత్లో తొలి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. ఇక అక్కడ్నుంచీ ప్రతి నెలా కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య వందలు...వేలు దాటి లక్షలకు చేరుకుంది. మొత్తం కేసులు 20లక్షలు దాటే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో మొత్తం కేసుల్లో 10శాతానికి పైగా ఇప్పుడు భారత్లో ఉన్నాయి. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నవాటిలో 20శాతం భారత్లోనివే ఉంటున్నాయి. అమెరికా, బ్రెజిల్లో రోజూ కొత్తగా నమోదయ్యే కేసుల కన్నా ఎక్కువగా భారత్లో వస్తున్నాయి. వైద్య నిపుణులు, పరిశోధకుల లెక్క ప్రకారం, భారత్లో కరోనా విజృంభణ పతాక స్థాయికి చేరే సమయం ముందుందని సమాచారం వెలువడుతున్నది.
వెంటాడుతున్న నిరుద్యోగం :కారణాలేమైనా దేశంలో అత్యధికమందిని ఆందోళనకు గురిచేస్తున్న మరో అంశం ఉపాధి. 'మూడ్ ఆఫ్ ద నేషన' లోనూ దీనిపై పెద్ద సంఖ్యలో స్పందించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోవటం మోడీ సర్కార్ ప్రధాన వైఫల్యంగా సర్వేలో పాల్గొన్న 23శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇతర సర్వేలు, అధ్యయనాల ప్రకారం, కరోనా, లాక్డౌన్ విధింపు వల్ల 12.2 మంది ఉపాధి కోల్పోయారు. మే నెలలో నిరుద్యోగ రేటు 27.1శాతానికి చేరుకుంది.
ప్రాంతాల వారీగా సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాల్ని పరిశీలిస్తే, కరోనాను కట్టడి చేయటంలో కేంద్రం విఫల మైందని దక్షిణాదిన మూడింట ఒకవంతు వ్యక్తం చేశారు.
ప్రధాన వైఫల్యం ఏది? అన్న ప్రశ్నకు..
కోవిడ్-19 కట్టడిలో వైఫల్యం - 25 శాతం
నిరుద్యోగ సమస్య - 23 శాతం
- వలసల సంక్షోభం - 14శాతం
- నిత్యావసర సరుకుల ధరలు - 11శాతం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేకపోయారు - 7శాతం
- ఆరోగ్య సేవలు మెరుగుపడలేదు - 6శాతం
- రైతాంగ సంక్షోభం - 6శాతం