Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుంజుకోవడానికి 8 నెలలు పట్టొచ్చు : డీఅండ్బీ చీఫ్ ఎకనామిస్ట్
న్యూఢిల్లీ : కరోనా ప్రతికూలతల నుంచి ఎంఎస్ఎంఈలు పుంజుకోవడానికి మరో 7-8 నెలలు పట్టొచ్చని డూన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్ అరుణ్సింగ్ అంచనా వేశారు. ఆయా రంగాలు, అంశాలను బట్టి రికవరీ ఉంటుందన్నారు. మొత్తం దేశ జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)లు 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. అరుణ్ ఓ వెబినార్లో మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ఆన్లైన్ గేమింగ్, టెలికమ్యూనికేషన్స్, ఇ-ఎడ్యుకేషన్ లాంటి డిజిటల్ ఆధారిత రంగాలకు భారీగా అవకాశాలు దక్కాయన్నారు. మరోవైపు సంప్రదాయ రంగాలైన అహారం, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్, ఐటి, బ్యాంకింగ్, రిటైల్, ఆటోమోటివ్, రియల్ ఎస్టేట్, అభరణాలు తీవ్ర ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే మెరుగు అవుతున్నాయన్నారు. ఈ రంగాలు పుంజుకోవడానికి మరో ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టొచ్చన్నారు. లోహం, మీడియా, ఎంటర్టైన్మెంట్, రవాణ లాంటి రంగాలు 2020 ఫిబ్రవరి నాటి స్థాయికి చేరడానికి ఏడాది పట్టొచ్చన్నారు.