Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రాలకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న పేదవారికి తోచిన సాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా సోనూసూద్ ఫిలిప్పీన్స్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానం ఈ నెల 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నట్టు స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన ఫిలిప్పిన్స్కు విమానాన్ని పంపించడం ఇది రెండవసారి. కొన్నిరోజుల కిందట మనీలా నుంచి తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అంతేగాక కజకస్థాన్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం కూడా మరొక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్టు సోనూసూద్ మరో ట్వీట్లో తెలిపారు.