Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేగంపేట్: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. మార్కెట్ పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, కమ్మగడ్డకు చెందిన రామన్న కుమార్తె సౌందర్య(26) నాలుగేండ్లుగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమె విధులు ముగించుకుని ఆస్పత్రి వెనుక వైపు ఉన్న హాస్టల్ గదికి వెళ్లింది. తోటి నర్సులు రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్కు వచ్చే సరికి సౌందర్య అపస్మారక స్థితిలో ఉంది.