Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆర్మీ రీసెర్స్ మరియు రిఫరల్(ఆర్ అండ్ ఆర్) ఆసుపత్రి బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఆయన హేమోడైనమిక్ స్థిరంగా ఉందని, వెంటిలేటర్పైనే ఉన్నారని పేర్కొంది. ప్రణబ్ ముఖర్జీ సోమవారం మెదడులో రక్త నాళాలు గడ్డ కట్టడంతో ఆసుపత్రిలో చేరి వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదని, సాయంత్రం మరింత దిగజారిందని డాక్టర్లు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ కరోనాతోనూ బాధపడుతున్నారు.