Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020 జనవరి 1 నుంచి వర్తింపు
- జిఒ జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: కరోనా వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్న జూనియర్ డాక్టర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కెఎస్.జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలలుగా జూనియర్ డాక్టర్లకు వేతనాలు లేవని ఇటీవల నిరసనకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పం దించి వేతనం పెంచుతూ జిఒ జారీ చేసింది. పెంచిన వేతనాన్ని 2020 జనవరి ఒకటి నుంచి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. డిప్లమో, డెంటల్, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, హౌస్ సర్జన్ వంటి డాక్టర్లందరికీ వేతనాలు పెంచుతున్నట్లు ఉత్తర్వల్లో పేర్కొన్నారు.
పెంచిన వేతనాలు ఇలా...
విద్యార్థులు ప్రస్తుత వేతనం పెంచిన
(రూపాయల్లో) వేతనం
ఇంటర్నీస్ ఎంబిబిఎస్ 15,817 19,589
పిజి డిగ్రీ
మొదటి సంవత్సరం 35,589 44,075
రెండో సంవత్సరం 37,566 46,524
మూడో సంవత్సరం 39,543 48,973
పిజి డిప్లొమా
మొదటి సంవత్సరం 35,589 44,075
రెండో సంవత్సరం 37,566 46,524
సూపర్ స్పెషాలిటీ
మొదటిసంవత్పరం 39,543 48,973
రెండో సంవత్సరం 41,521 51,422
మూడో సంవత్సరం 43,497 53,869
ఎమ్డిఎస్ కోర్సు
మొదటి సంవత్సరం 35,589 44,075
రెండో సంవత్సరం 37,566 46,524
మూడో సంవత్సరం 39,543 48,973