Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: సీనియర్ ఫొటో జర్నలిస్టు, హిందూ విశ్రాంత చీఫ్ ఫొటోగ్రాఫర్ సిహెచ్విఎస్ విజయభాస్కరరావుకు ప్రతిష్టాత్మక ఫ్రొఫెషియన్సీ ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా గౌరవ పురస్కారం లభించింది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న విజయభాస్కరరావు ప్రతిభకు ఈ అవార్డుతో మరింత గుర్తింపు లభించింది. దీన్ని ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రధానం చేయనుంది. ఫొటోగ్రఫీకి చెందిన వేర్వేరు రంగాల్లో విజయభాస్కరరావు 38 ఏళ్ల కెరీర్లో 2225కు పైగా అవార్డులు పొందారు. సౌదీ అరేబియాలోని వరల్డ్ ఫొటోగ్రాఫర్స్ గ్రూపు నుంచి గౌరవ ఫెలోషిప్తోపాటు అంతర్జాతీయ ఫొటోగ్రఫీలో గ్రీక్ స్కూల్ ఆఫ్ ఫొటోగ్రఫీ క్లబ్లోనూ స్థానం సంపాదించారు. సైప్రస్ లండన్, ఫ్రాన్స్, సింగపూర్, అమెరికాలో వేర్వేరు సంస్థల గుర్తింపునూ పొందారు. దేశంలో ముంబయి, కోల్కతాలో ఫొటోగ్రఫీ క్లబ్ల గుర్తింపునూ సాధించారు.