Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సిపిఎం గుంటూరు పశ్చిమ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం నేడు వేలాదిమంది రైతులు 239 రోజులుగా ఆందోళన చేస్తున్నా వారి సమస్య పట్ల స్పందించకపోవడం దారుణమన్నారు. హోదా 15 ఏళ్ళు ఇస్తామని, విభజన హామీలన్నీ అమలు చేస్తామని నమ్మబలికిన బిజెపి నేడు ఆంధ్ర ప్రజలను వంచనకు గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ కాకుండా అభివద్ధి వికేంద్రీకరణపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రజా ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని అందరికీ అందుబాటులో ఉన్న అమరావతినే పాలనా రాజధానిగా కొనసాగించాలని కోరారు. అనంతరం తహశీల్దార్ భాస్కర్ రావుకి వినతి పత్రం అందజేశారు.