Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షక వ్యతిరేక బిల్లులను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
- పార్లమెంట్ వద్ద గాంధీ విగ్రహం ముందు లెఫ్ట్, ఎల్జేపీ ఎంపీల ఆందోళన
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కార్పొరేట్ వ్యవసాయంతో దేశంలోని రైతుల బతుకులు మరింత దయనీయంగా మారుతాయని సీపీఐ(ఎం) రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఎలమారం కరీం అన్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ సుమారు 60 శాతం ప్రజానీకం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఆ రంగమే కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్నదని వివరించారు. ఆ రంగాన్ని తన అనుకూల పెట్టుబడిదారులకు ధారదత్తం చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లోనే బడా కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్లతో పాటు విద్యుత్ సవరణ బిల్లును ఆమోదించుకోవాలని ప్రయత్నిస్తున్నదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సీపీఐ(ఎం), సీపీఐ, ఎల్జేపీ ఎంపీలు జెండాలు, ఫ్లకార్డులు పట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే వారంతా ఆందోళన చేపట్టారు. కిసాన్ విరోధి ముర్తాబాద్, మోడీ సర్కార్ ముర్తాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మజ్దూర్ విరోధి నరేంద్ర మోడీ అని నినాదాలు చేశారు. కార్మిక, కర్షక వ్యతిరేక నిర్ణయాలను మోడీసర్కారు వెనక్కి తీసుకోవాలని గళమెత్తారు. అనంతరం కరీం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను మోడీ ప్రభుత్వం చేపడుతుందని విమర్శించారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రభుత్వం బిల్లులపై సరైన చర్చ లేకుండానే అమలు చేస్తున్న దుస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లకు కట్టబెట్టిన స్వేచ్ఛావాణి జ్యాన్ని రద్దు చేయాలని చెప్పారు. కంపెనీలకు కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని అప్పగించే చర్యలు మానుకోవాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై పరిమితి రద్దును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, గృహ వినియోగదారులపై చార్జీలభారం పెంచే విద్యుత్ సవరణ బిల్లు ను ఉపసంహరించుకోవాలన్నారు. ఈబిల్లుల వల్ల రైతులు, చిన్న చితక వ్యాపారులు తీవ్రంగానష్టపోతారని వివరించారు. రైతుల నుంచి పంట లను కారుచౌకగా కొనుగోలుచేసి, బడావ్యాపారులు తమ గుత్తాధిప త్యాన్ని ప్రదర్శిస్తారని హెచ్చరించారు. పెద్ద పెద్ద కంపెనీలు వ్యవసాయ రంగంలోకి అడుగు పెడితే చిన్న సన్నకారు రైతులు తమపొలాల్లో తామే కూలీలుగా మారిపోతారని చెప్పారు. విద్యుత్ సంస్కరణ బిల్లు వల్ల ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత్ విద్యుత్తో పాటు రాయితీలు కనుమరుగవుతాయని అన్నారు. కేంద్రం రూపొందించిన ఈబిల్లుల వల్ల వ్యవసాయ రంగం దివాలా తీస్తుందని సీపీఐ ఎంపీ బినరు విశ్వం ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కెకె రాగేష్, బెర్నాదాస్ వైద్య, ఎల్జేపీ ఎంపీ ఎంవీఎస్ శ్రీయాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.