Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి మహిళా అధికారులుగా త్యాగి, రితిసింగ్ నియామకం
న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో సోమవారం అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. రక్షణరంగంలో లింగ సమానత్వానికి పునర్నిర్వచనం చెబుతూ.. నౌకాదళంలోకి ఇద్దరు మహిళా అధికారులు అడుగుపెట్టనున్నారు. యుద్ధనౌకల్లో పనిచేసేందుకు గానూ కుముదిని త్యాగి, రితిసింగ్ నియమితులయ్యారు. వీరిరువురు నౌకాదళంలో సబ్ లెఫ్ట్నెంట్ హౌదాలో పనిచేస్తున్నారు. నేవీలో ఎంతోమంది మహిళా అధికారులున్నా.. యుద్ధనౌకల్లో వీరిని నియమించడం ఇదే ప్రథమం. ఎక్కువ కాలం పనిచేయాల్సి రావడం, సిబ్బంది క్వార్టర్లలో టాయిలెట్, బాత్రూంల కొరత, ప్రైవసీ ఇబ్బందుల నేపథ్యంలో ఇంతకాలం నేవీలో మహిళా అధికారులను నియమించలేదు. కాగా.. త్యాగి, రితిసింగ్లు నేవీలో నిర్వహించే వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం అమ్ములపొదిలో ఉన్న అత్యాధునిక ఎంహెచ్-60 ఆర్లలో వీరు విధులు నిర్వర్తించనున్నట్టు సమాచారం.