Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదింపజేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలను జరుగుతున్నాయి. హర్యానాలో జరిగిన రాష్ట్రవ్యాప్త నిరసనలో మాజీ సిఎం భూ పేందర్ సింగ్ పాల్గొన్నారు. ఢిల్లీలో ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. తమిళనాడులోని రైతులు కేంద్రం ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ బిల్లుల నకలను దహనం చేశారు. ఈ బిల్లులపై సీపీఐ(ఎం) చెన్నరులో నిరసన చేపట్టింది. పశ్చిమ బెంగాల్లోనూ ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ నిరసనలు జరిగాయి. బెంగళూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు.