Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతన్నల పక్షాన నిలబడిన ఎంపీలపై వేటు
- రాజ్యసభలో 8 మంది సస్పెన్షన్
- డిప్యూటీ చైర్మెన్ ఇచ్చిన అవిశ్వాస నోటీసు తిరస్కరణ
- ప్రతిపక్ష పార్టీల ఆందోళన
- సస్పెన్షన్కు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద నిరవధిక దీక్ష
- రాత్రంతా కొనసాగిన దీక్ష...
- టీఆర్ఎస్, తదితర పార్టీల సంఘీభావం
- వాయిదాలతో పెద్దలసభ కాలయాపన
- మా గొంతు నొక్కలేరు : సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం
- రాష్ట్రపతిని కలవాలని 12 పార్టీల నిర్ణయం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రైతన్నల పక్షాన నిలబడినందుకు ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభ చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు ప్రవర్తన పేరుతో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. చైర్మెన్ తీసుకున్న నిర్ణ యాన్ని ఖండించారు. రైతుల పక్షాన మాట్లాడినందుకు, రైతుల గొంతును వినిపించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని తప్పుపట్టారు. అలాగే బిల్లు ల్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ సింగ్పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను వెంకయ్యనాయుడు తిరస్కరిం చారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సోమవారం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల చైర్మెన్ ఎం.వెం కయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ చరిత్రలో ఓ చీకటి దినంగా మిగిలిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరసనలకు కారణమైన ఎంపీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్
నాలుగు పార్టీలకు చెందిన ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహా రాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తీర్మానాన్ని చదివి విని పించారు. దీన్ని ఆమోదిస్తూ సభ నుంచి 8 మంది సభ్యులను ఈ సమావేశాల మిగిలిన రోజులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కెకె రాగేష్, ఎలమారం కరీం (సీపీఐ(ఎం)), డెరెక్ ఒబ్రెయిన్, డోలాసేన్ (టీఎంసీ), సంజరు సింగ్ (ఆప్), రాజీవ్ సత్వ్, రిపున్బోర, నాజిర్ హుస్సేన్ (కాంగ్రెస్)పై చర్య లు తీసుకున్నారు. వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదే శించారు. అప్పుడే ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని, లేకపోతే ఇచ్చేది లేదన్నారు. అయినా సభ్యులు సభ నుంచి బయటకెళ్లేందుకు నిరాకరించారు. సస్పెండ్కు వ్యతి రేకంగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభు త్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు హోరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో చైర్మెన్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తరువాత కూడా సభలో అదే తంతు కొనసాగింది. దీంతో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ సభను మరోసారి వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోయేసరికి, సభను మంగళవారానికి వాయిదా వేశారు.
డిప్యూటీ చైర్మెన్ అవిశ్వాస తీర్మాన తిరస్కరణ
బిల్లుల్ని నిబంధనలకు విరుద్దంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ సింగ్పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవి శ్వాస తీర్మాన నోటీసును తిరస్కరించారు. 12 పార్టీలు కలిసి 50మంది ఎంపీిల సంతకాలతో అవిశ్వాస తీర్మాన నోటీస్ను ఇచ్చారు. సభానియమాల ప్రకారం డిప్యూటీ చైర్మన్పై అవిశ్వాసం ఆమోదనీయం కాదన్న వెంకయ్య నాయుడు నోటీసులను తిరస్కరించారు.
గాంధీ సాక్షిగా నిరవధిక నిరాహార దీక్ష
సస్పెన్షన్ను నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం సాక్షిగా నిరవధిక నిరాహార దీక్షకు ఎంపీిలు దిగారు. ఎనిమిది మంది ఎంపీిలను సస్పెండ్ చేస్తూ చైర్మెన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ''పార్లమెంట్ హత్య, రైతుల కోసం తాము పోరాడుతాం'' అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరాహార దీక్షను కొసాగిస్తున్నారు. దీక్ష చేస్తున్న ఎనిమిది మంది ఎంపీిలకు టీఆర్ఎస్, వివిధ పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపారు. దీక్ష రాత్రంతా కొనసాగింది. విగ్రహం వద్దనే నిద్రించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మందిఎంపీిలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలనిడిమాండ్ చేస్తూ మంగళవారం ప్రతిపక్ష పార్టీల ఎంపీిలంతా ఆందోళన చేయనున్నారు. ప్రభుత్వ స్పందన బట్టీ భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా కలవనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను 12 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు కలవనున్నారు. రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించకుండా ఆమోదించుకున్న రైతు వ్యతి రేక బిల్లులపై సంతకం చేయొద్దని వారు రాష్ట్రపతిని కోరనున్నారు. మోడీసర్కారు పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని సీపీఐ (ఎం) ఎంపీ ఎలమారం కరీంమండిపడ్డారు. పార్లమెంట్ను హత్య చేసిందని ధ్వజమెత్తారు. ''రైతుల తరపున తమ గొంతు వినిపిస్తూ మేము మాపోరాటాన్ని కొనసాగిస్తాం. మోడీ ప్రభుత్వం అప్రజాస్వా మ్యక చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలు బహిరంగం గా బహిర్గతమవు తున్నాయి'' అని విమర్శించారు.
రాష్ట్రపతిని కలిసిన శిరోమణి అకాలీదళ్
దేశంలోని రైతుల జీవనోపాధిపై దాడి చేసే బిల్లులపై సంతకం పెట్టొద్దని శిరోమణి అకాలీదళ్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరింది. సోమవారం రాష్ట్రపతిని శిరోమణి అకాలీదళ్ బృందం కలిసింది. అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ ఎంపీ సుఖ్బీర్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడుతూ తాము రాష్ట్రపతిని కలిసి బిల్లులపై సంతకం పెట్టకుండా, తిరిగి పార్లమెంట్కు పంపాలని కోరినట్టు తెలిపారు.
కౌలు రైతు ఆత్మహత్య
కోటపల్లి : కాళేశ్వరం మేడిగడ్డ బ్యాక్ వాటర్ కౌలు రైతు ప్రాణాన్ని బలిగొంది. పదెకాల పత్తి పైరు నీట మునిగి దెబ్బతింది. దీంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పుల్లగామకు చెందిన కౌలు రైతు కామ లింగయ్య(60) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.