Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నకి కేంద్ర లిఖితపూర్వక జవాబు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
గూడు లేని పేదలకి ఇండ్లను నిర్మించే లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పీఎంఏవై(యూ) కింద తెలంగాణకు రూ. 3,382.03 కోట్లను కేటాయించినట్టు కేంద్ర గహ,పట్టణ వ్యవహారాలు మంత్రి హరిదీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ఇందులో రూ. 2, 237.37 కోట్లు ఇప్పటికే విడుదలు చేశామని ఆయన లోక్సభలో వివరించారు. గడిచిన ఆరేండ్లలో పీఎంఏవై(యూ) కింద కేంద్రం అందించిన సాయం, ఇండ్ల నిర్మాణంపై టీ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2, 174.98 కోట్ల నిధుల్ని వినియోగించుకుందని వివరించారు. 2 ,02,541 ఇండ్లను కేంద్ర మంజూరు చేయగా... 75,369 ఇండ్లు లబ్దిదారులకు అందినట్లు చెప్పారు.
రాష్ట్రంలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు 861.33 కోట్లు
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటిని అందించే దిశలో జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద కేంద్రం తెలంగాణకు రూ. 861. 33 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిందన కేంద్రం స్పష్టం చేసింది. జేజేఎం స్కీంలో భాగంగా 2020-21 సంవత్సరానికి గాను రూ. 412. 19 కోట్లు కేటాయించామన్నారు. ఇందులో ఇప్పటికే రూ. 82. 71కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.