Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయన్న అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకూ పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట అయిన ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా 28 ఏళ్ల యువకుడుని అరెస్టు చేశారు. షోయిక్ రాజ్పుత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, అతని ఇంటి సిబ్బంది దేవేశ్ సావంత్లకు డ్రగ్స్ రాకెట్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరి బెయిల్ పిటిషన్ను కూడా ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు తిరస్కరించింది.