Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 33 ప్రయివేటు ఆస్పత్రుల్లో కోవిడ్-19 రోగులకు 80 శాతం ఐసీయూ పడకలను రిజర్వేషన్ చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులను పరిష్కరించటానికి ప్రయివేటు ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలను కేటాయించడం చాలా ముఖ్యంమని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆప్ బుధవారం హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేయనుంది. కాగా 33 ప్రయివేటు ఆసత్రుల్లో కరోనా రోగులకు 80 శాతం ఐసీయూ పడకలను రిజర్వ్ చేయాలన్న ఆఫ్ ప్రభుత్వ నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.