Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్లో జారీ చేసిన అధికారులు
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఇప్పటిదాకా 18.52 లక్షల మందికి శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు అందజేసినట్టు రాష్ట్ర పాలనాయంత్రాంగం తెలిపింది. జమ్మూ, కాశ్మీర్ డివిజన్లలోని 20జిల్లాలలో నివాస ధృవీకరణ పత్రాల కోసం మొత్తం 21,99,513 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 20,87,815 మంది పూర్తి సమాచారంతో కూడిన పత్రాలు ఇచ్చారనీ, అందులో 18,52,355 మం దికి వాటిని అందజేశామని వివరించారు. మిగిలినవాటిని తిరస్కరించారు. 18.52 లక్షలలో.. 16 లక్షలకు పైగా శాశ్వత నివాస ధవీకరణ పత్రాలు ఇవ్వగా
1.72 లక్షల మందికి రాష్ట్ర, రాష్ట్రేతర సబ్జెక్టు నిబంధనల కింద ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన 17,978 మంది, వాల్మీకి వర్గానికి చెందిన సుమారు రెండువేల మంది ఉన్నారు.