Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్లకు రూ.1400 కోట్ల టోపి
- కల్పిత ఆస్తులతో ఐస్క్రీమ్ కంపెనీ దగా : సిబిఐ సోదాల్లో వెల్లడి
న్యూఢిల్లీ : మరో బిలియనీర్ కంపెనీ భారత బ్యాంక్లకు వేల కోట్లలో కుచ్చుటోపి పెట్టింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్క్రీమ్ తయారీదారు, పాల ఉత్పత్తుల కంపెనీ క్వాలిటీ లిమిటెడ్ భారత బ్యాంక్లను రూ.1400 కోట్ల పైగా మోసం చేసినట్లు నేర పరిశోధన సంస్థ సిబిఐ తనిఖీల్లో వెల్లడయ్యింది. ఈ కంపెనీ డైరెక్టర్లు బ్యాంక్లకు తప్పుడు లెక్కలు చూపించడంతో పాటుగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. సోమవారం నాడు ఢిల్లీతో సహా ఎనిమిది చోట్ల సిబిఐ అధికారులు తనిఖీలు చేయడంతో క్వాలిటీ లిమిటెడ్ మోసాలు బయపపడ్డాయి. దీంతో ఈ కంపెనీ బ్యాంక్ రుణాల చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు అభియోగాలు రుజువు అయ్యాయి. ఈ స్కామ్లో క్వాలిటీ డైరెక్టర్లు సంజరు ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ భాగస్వాములుగా ఉన్నారు. 2012లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసిన కేసులో ఈ కంపెనీపై చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్, అవినీతి కేసు నమోదయ్యింది. క్వాలిటీ లిమిటెడ్ 2010లో బ్యాంకు నుంచి రుణాలు తీసుకుందని.. 2018 ప్రారంభం నుంచి చెల్లింపులు చేయడం లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ) ఫిర్యాదు చేసింది. 2018 ఆగస్ట్ నుంచి ఈ ఖాతాను నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. బిఒబి ఫిర్యాదు మేరకు సిబిఐ తన దర్యాప్తును ప్రారంభించింది. క్వాలిటీ కంపెనీ మొత్తం అమ్మకాలను రూ.13,147.25 కోట్లుగా చూపింది. ఇందులో రూ.7,107.23 కోట్లు మాత్రమే బ్యాంకుల కన్సార్టియం ద్వారా జరిగినట్లు బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ను సిబిఐకి సమర్పించింది. రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసి.. క్వాలిటి తన వ్యాపార కార్యకలాపాలను అధికంగా చూపించిందని బిఒఐ తన ఫిర్యాదులో పేర్కొంది.
కల్పిత ఆస్తులతో మోసం
బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, సిండికేట్ బ్యాంక్లతో కూడిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతత్వంలోని కన్సార్టియంకు క్వాలిటి లిమిటెడ్ మొత్తం రూ.1400.62 కోట్ల బ్యాంక్ రుణాలు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని సిబిఐ ప్రతినిధి ఆర్కె గౌర్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఫండ్ల మళ్లీంపు, సంబంధిత పార్టీలతో లావాదేవీలు, కల్పిత పత్రాలు, రశీదులతో పాటు తప్పుడు ఖాతాలు, ఆస్తులను సష్టించి బ్యాంకులను మోసం చేశారని తెలిపారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్లోని సహరన్పుర్, బులండషహర్, రాజస్థాన్లోని అజ్మీర్, హర్యాణాలోని పల్వాల్ ప్రాంతాల్లోని క్వాలీటీ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీ ఇప్పటికే దివాలా కేసును ఎదుర్కొంటుంది. 2018 డిసెంబర్ నాటికి బ్యాంక్లకు ఈ కంపెనీ దాదాపుగా రూ.1,900 కోట్ల అప్పు పడి ఉంది. కాగా కెకెఆర్ ఇండియా ఫైనాన్సీయల్ సర్వీసెస్ ఇందులో రూ.520 కోట్ల నిధుల సహకారం అందించగా.. తిరిగి చెల్లించకపోవడంతో 2016లో కెకెఆర్ ఇండియా క్వాలిటీ లిమిటెడ్ను కోర్టుకు లాగింది.