Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బిఐ ఛైర్మన్ వెల్లడి
న్యూఢిల్లీ : కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారానే పెట్టుబడులు పెరగవని ఎస్బిఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ అన్నారు. అయినప్పటికీ బ్యాంక్లు తమ ఖాతాదారులకు వడ్డీ రేట్ల తగ్గింపును బదలాయిస్తున్నాయన్నారు. 47వ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఎఐఎంఎ) కన్వెన్షన్లో రజ్నీష్ మాట్లాడుతూ ప్రస్తుత ఏడాదిలో రుణ వృద్థి చాలా నెమ్మదిగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో పెట్టుబడులకు అవకాశం ఉండదన్నారు. మౌలిక వసతులపై పెట్టుబడులు ఆర్థికాభివృద్థి రేటుకు మద్దతు చేయనన్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం ఆర్థిక వ్యవస్థకు మద్దతు చేయడంతో పాటుగా నిర్మాణ రంగంలో ఉపాధి, డిమాండ్ పెరగనుందన్నారు.