Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగతదూషణ మానుకొని... సబ్జెక్ట్పై చర్చ చేయాలని సూచన
- రాజకీయాల్లో అసభ్యభాషకి తావులేదన్నఎంపీలు వెంకటేష్ నేత, రంజిత్ రెడ్డి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరోః
తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలు బొర్లకుంట వెంకటేష్ నేత, గడ్డం రంజిత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో దుర్భాషకి తావులేదని అభిప్రాయపడ్డారు. మంగళ వారం ఢిల్లీలోని విజరు చౌక్ వద్ద వారు ఇరువురు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి నిధులు ఇవ్వలేదని... తమ నేతలు వ్యాఖ్యానిస్తే అరవింద్ వ్యక్తిగతదూషణ ఇష్టారీతిన చేయడం ఏమిటన్నారు. ఒకే వేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నది ఆయన వాదనయితే... దాన్ని సరైన పద్దతిలో వెల్లడించాలని సూచన చేశారు. ఆధారా లతో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తే తమకి అభ్యంతరం లేదన్నారు. అంతేకానీ, తమ నేతలను ఇష్టారీతిన తూలనాడితే ఊరుకునేది లేదన్నారు. అగ్రి బిల్లులను వ్యతిరేకిస్తూ తాము మాట్లాడిన అంశాలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులు ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రం నుంచి రూ. 50 వేల కోట్లు కేంద్రానికి ఇస్తే తిరిగి ఇచ్చేది కేవలం 23 వేల కోట్లే అని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన చాలా ఆదాయాల్లో కోత విధించారని గుర్తు చేశారు. నిజామాబాద్లో రైతులను అడుగితే రైతు బంధు ఎవరు ఇస్తున్నారో చెప్తారని అరవింద్కి సూచించారు. మహమ్మారి కరోనా నియంత్రణకు కేవలం రూ 290 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. మిగులు నిధులు ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని గుర్తు చేశారు. జీఎస్టీ, వెనుకబడిన జిల్లాల నిధులు రూ. తొమ్మిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. బీజేపీ ఎంపీలు వాటిని ఇప్పించేందుకు కషి చేయాలన్నారు. చేవేళ్ళ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల చేత శభాష్ అనిపించుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులపై కేటీఆర్ తప్పుడు ప్రచారం : ఢిల్లీలో మీడియాతో ఎంపీ అరవింద్
కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిధుల్ని... కరోనా కాలంలో కేంద్రం, రాష్ట్రానికి కేటాయించిన మొత్తం నిధులుగా చెబుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యత గల మంత్రి హౌదా లో ఉండి అబద్ధాలను ప్రచారం చేయడంతో 'క్యారెక్టర్ లెస్ ఫెల్లో' గా మిగిలిపోయారని అన్నారు. క్యాబినెట్ మంత్రిగా వివిధ శాఖ నుంచి నిధులు వస్తాయనే సోయి కూడా ఆయనకి లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలను చేయడంలో తండ్రిని మించిన ఘనుడిగా కేటీఆర్ తయారయ్యారని విమర్శించారు. ఎన్టీఆర్ పై ప్రేమతో కేసీఆర్ తన కొడుకుకు తారక రామారావు అని పేరు పెట్టారన్నారు. అయితే, కేటీఆర్ చేస్తోన్న నల్లికుంట్ల చేష్టలకు... నల్లికుంట్ల తారక రామా రావుగా పేరు పెట్టాలని అన్నారు. ఢిల్లీలోని విజరు చౌక్ లో అరవింద్ మీడియాతో మాట్లాడారు. మూడు నెలల లాక్ డౌన్ కాలంలో వివిధ పథకాలు, ఇతర మార్గాల ద్వారా కేంద్రం, స్టేట్ కు దాదాపు రూ. 7 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ నిధుల్ని అయ్యా, కొడుకులు(కేసీఆర్, కేటీఆర్) లు బకాసురులుగా మింగేశారన్నారు.