Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెల 31తో నుంచి యూజీసీ అడ్మిషన్ల ప్రక్రియ
- 10లోపే సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ : రెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లు వారికి ఊరటనిచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న కంపార్ట్మెంట్ పరీక్షా ఫలితాలు వచ్చేనెల 10 లోపు విడుదల చేస్తామని సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు వివరించగా.. వర్సిటీలలో అడ్మిషన్ల ప్రక్రియ కూడా అక్టోబర్ 31 దాకా చేపడతామని యూజీసీ తెలిపింది. దీంతో కంపార్ట్మెంట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోయే అవకాశం లేదు. విద్యార్థుల భవిష్యత్ దష్ట్యా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో విచారణ చేపట్టిన విషయం విదితమే. కాగా, ఈ కేసులో ఇరు బోర్డులు సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోర్టు రెండ్రోజుల కిందే తీర్పునిచ్చింది. వర్సిటీలలో అడ్మిషన్ల ప్రక్రియకు అక్టోబర్ 31 చివరి తేది కాగా.. మిగిలిపోయిన సీట్లను నవంబర్ 30 వరకు నింపుతామని యూజీసీ కోర్టుకు తెలిపింది.