Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల మద్దతు
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరి స్తున్న అప్రజాస్వామిక విధానాలపై గొంతెత్తేందుకు దేశంలోని యావత్ రైతాంగం సిద్ధమౌతోంది. పార్ల మెంటరీ సంప్రదాయాలను మంటలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం అధికార బలంతో వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేసుకున్న తీరుపై
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల జీవితాల పాలిట శాపంగా మారనున్న బిల్లులను వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆలిండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకెఎస్సీసీ), ఆలిండియా ఫార్మర్స్ యూనియన్(ఏఐఎఫ్యూ), భారతీయ కిసాన్ సంఘ్(బీకేయూ), ఆలిండియా కిసాన్ మహాసంఘ్(ఏఐకేఎం)లు పిలుపుమేరకు జరుగుతున్న ఈ భారత్ బంద్కు దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 20కు పైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే బిల్లులకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగున్నాయి. ఈ ఆందోళనల్లో పార్టీలకు వ్యతిరేకంగా రైతు సంఘాలకు చెందిన నాయకులు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్రలకు చెందిన రైతు సంఘాలు కూడా శుక్రవారం నాడు షట్డౌన్కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న పోరాటానికి దేశంలోని కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ 18 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బుధవారం రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను కలిసి విన్నవించారు. పార్లమెంట్ పున్ణపరిశీలన కోసం బిల్లులను వెనక్కు పంపాలని ఇదే సమయంలో వారు కోరారు.
హైదరాబాద్లో ప్రజాసంఘాల పోస్టర్ విడుదల
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లో బషీర్బాగ్ చౌరస్తా దగ్గర్లోని జీఎస్టీభవన్ వద్ద జరగనున్న ధర్నాలో భాగస్వాములు కావాలని ఆయా సంఘాలు కోరాయి. జిల్లా, మండల కేంద్రాల్లో జరుగు ఆందోళనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. గురువారం హైదరాబాద్లో తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, ఐద్వా, గిరిజన సంఘం, వత్తి సంఘాలు, కెేవీపీఎస్, టీజీఎస్, ఆవాజ్, డివైఎఫ్ఐ నాయకులు ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి వెంకట్, టి సాగర్, మల్లు లక్ష్మి, వంగూరి రాములు, పి ఆశయ్య, అబ్బాస్, స్కైలాబ్బాబు, శ్రీరాం నాయక్, బుర్రి ప్రసాద్, ధర్మా నాయక్, విజరు, ఉడుత రవీందర్, శోభన్ మాట్లాడారు.