Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెఫ్ట్ పార్టీల ధర్నాకు మద్దతు : ఉత్తమ్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ వాటా నీటిని తోడుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్ట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపూరితంగా సహకరిస్తున్నారని టీపీసీసీ అధినేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అదనంగా రోజుకు ఆరు టీఎంసీల నీటిని మళ్లించేందుకు ఏపీ సర్కారు పనులు ప్రారంభించిం దన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ పనులను కేసీఆర్ అడ్డుకునే చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాల విషయంలో అపెక్స్ కౌన్సిలో చర్చించేందుకు అజెండా అంశాలను ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ జనవరి, మే లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. అలాగే, ఆగస్టులో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు కావాలని కేసీఆర్ ను కోరిందన్నారు. అయితే, అక్రమంగా ఆరు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ మళ్లించుకునేందుకు చేస్తోన్న కుట్రను రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాలో పొందుపర్చలేదన్నారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా నేడు రైతు సంఘాలు, లెఫ్ట్ పార్టీలు చేస్తోన్న ఆందోళనలకు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావం ప్రకటించాలన్నారు