Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల ఈనెల మొదటి నుంచి ప్రారంభమైందని రోజుకు 4 వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నాయని అన్నారు. ఇది రెండో దశ వైరస్ వ్యాప్తికి సూచన అని చెప్పారు. దీంతో రెండో దశ కరోనా వ్యాప్తి ప్రారంభమైందని చెప్పిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. నగరంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ రెండో దశ కరోనా వ్యాప్తి ఢిల్లీలోతీవ్రస్థాయిలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. ఈనెల 16న రాజధానిలో రికార్డు స్థాయిలో దాదాపు 4,500 కేసులు వచ్చాయని, ఆ తరువాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చి గత 24 గంటల్లో 3,700 కేసులు నమోదయ్యాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా గ్గే అవకాశం ఉందని అన్నారు. ఈనెల 9న మొదటిసారిగా ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటగా, 16న రికార్డు స్థాయిలో 4,473 కేసులు నిర్ధారణ అయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం 15వ తేదీ నుంచి 19 వ తేదీ వరకూ కేసుల సంఖ్య 4 వేల నుంచి 4,500 మధ్య ఉంటూ వచ్చింది. వైరస్తో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 12,63,799 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 2,56,789 కేసులతో ఢిల్లీ ఐదో స్థానంలో ఉంది.