Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 31.2శాతం పెరిగిన అన్ఎంప్లారుమెంట్ రేటు : సీఎంఐఈ
- హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
- ప్రజాగ్రహాన్ని చూస్తున్న ఎన్డీయే సర్కారు
పాట్నా : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్ రాష్ట్రం తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ విషయంలో జేడీ(యూ), బీజేపీ కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. నియోజకవర్గాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి అసంతృప్తి సెగ ఎదురవుతోంది. ఉద్యోగాల కల్పనతో పాటు ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే ఆగ్రహం ప్రజల్లో స్పష్టం కనిపిస్తున్నది. ముఖ్యంగా ఎన్డీయేకు చెందిన దాదాపు 12 మంది నాయకులు ఇటీవల పలు సందర్భాలలలలలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడమే దీనికి బలలలాన్ని చేకూరుస్తున్నది. అవి కూడా వారివారి సొంత నియోజకవర్గాలలలే కావడం గమనార్హం. వీరిలో ముగ్గురు మంత్రులు కూడా ఉండటం ఎన్డీయే ప్రజాప్రతినిధుల పట్ల జనాగ్రహం తీవ్రత ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పొచ్చు.
బీజేపీ సీనియర్ నాయకుడు ప్రేమ్ కుమార్.. నితీశ్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆయన.. ఔరంగబాద్లోని గోహ్ లో గల ఛత్రా గ్రామంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ శర్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రేమ్కుమార్ మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా.. అక్కడి ప్రజలందరూ ఆయనతో పాటు ప్రధాని మోడీ, మనోజ్ శర్మలకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. '' గో బ్యాక్, గో బ్యాక్'', ''రాష్ట్రంలో మళ్లీ నిరుద్యోగాన్ని తీసుకొచ్చిన బీజేపీకి ఓటు వెయ్యం'' అనే నినాదాలతో యువకులు హోరెత్తించారని గోహ్ కు చెందిన స్థానికుడు రాజేశ్ ప్రసాద్ తెలిపారు.
ఇక మరొక ఘటనలలలో బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర రోడ్ల నిర్మాణాల శాఖ మంత్రి నంద కిషోర్ యాదవ్కు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం పాట్నాసాహిబ్లలలో పర్యటించిన ఆయనకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకతను చవిచూశారు. తమ ఎమ్మెలలల్యే కిషోర్ యాదవ్ కనిపించడం లలలేదనీ బ్యానర్లను స్థానికులు చేతబట్టుకొని నిరసన తెలిపారు. '' మంత్రి పనితీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బడి పహారీ నుంచి చోటీ పహారీ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ బ్రిడ్జిని నిర్మించడంలలో ఆయన విఫలమయ్యారు. బాలికల పాఠశాలను నిర్మిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోలేదు'' అని స్థానికుడు రవీందర్ కుమార్ తెలిపారు. మంత్రికి వ్యతిరేకంగా నియోజకవర్గంలలలో తాము నిరసనలను కొనసాగిస్తామనీ, రాబోయే ఎన్నికలలల్లో ఆయనకు ఎట్టి పరిస్థితులలల్లోనూ ఓటు వేయబోమని అక్కడి ప్రజలు తెలిపారు. కాగా, నందకిషోర్ యాదవ్ ఇక్కడ నుంచి 2015 అసెంబ్లీ ఎన్నికలలల్లో అతిస్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
రాష్ట్ర గ్రామీణ కార్మిక మంత్రి, జేడీయూ సీనియర్ నాయకులు శైలలలేశ్ కుమార్ కూడా తన సొంత నియోజకవర్గం జమాలలల్పూర్లలలోని ఇంద్రుఖ్ గ్రామంలలలో ప్రజాగ్రహాన్ని చవిచూశారు. తమ ప్రాంతాలలల్లో రోడ్లు, మురుగుకాలువలు సరిగ్గా లేవనీ, కనీస మౌలిక సదుపాయాలూ కరువయ్యాయని పర్యటనకు వచ్చిన మంత్రిని స్థానికులు నిలదీశారు. దీంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీవ్ర అసహనంతో మంత్రి అక్కడ నుంచి వెనుదిరిగారు.
ఇక కోంచ్ బ్లాక్లలలో పర్యటించిన ఔరంగాబాద్ బీజేపీ ఎంపీ సుశీలలల్ కుమార్ సింగ్ కు యువత ముచ్చెమటలు పట్టించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ చేసిన వాగ్దానం ఏమైందని ఎంపీని స్థానిక యువకులు గట్టిగా నిలదీశారు. అలలలాగే దర్భాంగా బీజేపీ ఎమ్మెల్యే సంజరు సరోగీ.. తనను ప్రశ్నించిన ప్రజలపై ఎదురు తిరిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు ప్రజాగ్రహంతో వెనుదిరిగారు. బఖ్తియార్పూర్కు చెందిన మరో బీజేపీ ఎమ్మెలలల్యే రన్విజరు సింగ్కు తన సొంత నియోజకవర్గంలలలో ప్రజలు నల్లజెండాలతో ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. రాష్ట్రంలలలో ఎక్కడ చూసిన బీజేపీ, జేడీయూ ఎమ్మెలలల్యేలు, ఎంపీలకు తమ సొంత నియోజకవర్గాలలల్లోని ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలలలో విఫలమైందనీ, అందుకోసమే జనాగ్రహాన్ని చూస్తున్నదని విపక్ష లలలెఫ్ట్, ఆర్జేడీ, కాంగ్రెస్ ఆరోపించాయి. ఈ ఏడాదిలలో జరగబోయే ఎన్నికలలల్లో ఎన్డీయేకు తీవ్రంగా ఎదురుగాలి వీచే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.