Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మకాలు, తయారీ బంద్..!
- కేంద్రంపై వాహన పరిశ్రమ గుర్రు
న్యూఢిల్లీ : అమెరికన్ లగ్జరీ బైక్ తయారీదారు హార్లే డెవిడ్సన్ భారత కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఇక్కడి ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. విక్రయాలు కూడా నిలిపివేస్తున్న ట్టు వెల్లడించింది. తమ వ్యూహాలను మార్చుకుం టున్నట్టు గత రెండు నెలల కిందట ఈ కంపెనీ ప్రకటించింది. అధిక లాభదాయకత కలిగిన మోటార్సైకిల్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తామనీ, అలాగే అమెరికా మార్కెట్పైనే పూర్తిగా దష్టి సారిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మార్కెట్ నుంచి వైదొలిగిందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. 2020లో కంపెనీ పునర్ వ్యవస్థీకరణ విలువ దాదాపు 169 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని హార్లీ డేవిడ్సన్ పేర్కొంది. దేశంలో 70 మంది ఉద్యోగుల తొగింపు కూడా ఇందులో భాగంగానే పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఢిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడర్ బావల్లో తయారీ ప్లాంట్ను కలిగి ఉంది. గుర్గావ్లో విక్రయ కార్యాలయం ఉంది. అయితే వినియోగదారులకు ఇచ్చిన కాంట్రాక్ట్ కాలపరిమితి వరకు తమ డీలర్షిప్లు సేవలను అందించ నున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. కంపెనీ అంతర్జా తీయ విక్రయాల్లో భారత్ నుంచి వాటా 5 శాతం దిగువునే ఉందని తెలిపింది. అందుకే కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నట్టు స్పష్టం చేసింది. దేశంలో వాహన పరిశ్రమపై మోడీ సర్కార్ భారీగా పన్నులు వేస్తోంది. దీంతో అనేక ఆటోమొబైల్ కంపెనీలపై కేంద్రంపై గుర్రుగా ఉన్నాయి. ఇటీవలే టయోటా కిర్లోస్కర్ కూడా తన నూతన ప్రణాళికలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి.. తర్వాత వెనక్కి తీసుకుంది. దీంతో వాహన పరిశ్రమ అంతరంగం స్పష్టమవుతుంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా హార్లే డెవిడ్సన్ వెళ్లిపోవడం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచనుందని నిపుణులు భావిస్తున్నారు.