Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లోని లఢక్లో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 4.27 గంటలకు ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. లేV్ా నుంచి 129 కిలోమీటర్ల దూరంలో ఈ భూ ప్రకంపనల కేంద్రం ఉందని తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో ఇది ప్రారంభమైందని వివరించింది. జమ్ముకాశ్మీరులోని శ్రీనగర్లో బుధవారం 3.6 తీవ్రతగల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.