Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముకత్సర్ : కేంద్రం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక బిల్లులకు నిరససగా అక్టోబర్ 1న పంజాబ్ కిసాన్ మార్చ్ నిర్వహించనున్నట్టు శిరోమణి ఆకాళీదళ్ (ఎస్ఏడీ) ప్రకటించింది. శుక్రవారం భారత్బంద్లో భాగంగా ముకత్సర్ జిల్లాలో బాదల్ గ్రామంలో ట్రాక్ట్ర్ మార్చ్లో ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్ నడిపారు. బాదల్ పక్కన అతని భార్య, మాజీ కేంద్ర మంత్రి హరిసిమ్రాట్ కౌర్ బాదల్ కూర్చున్నారు. ఈ సందర్భంగా బాదల్ మాట్లాడుతూ 1న పంజాబ్ కిసాన్ మార్చ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. తక్త్ డండమ్ సాహిబ్, అకల్ తక్త్ సాహిబ్, అనండ్పూర్ సాహిబ్ ప్రాంతాల నుంచి చంఢఘీర్ వరకూ మార్చ్ ఉంటుందని పేర్కొన్నారు.