Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్థారించిన డీఎన్ఏ పరీక్షలు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో జులైలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురూ రాజౌరీ ప్రాంతానికి చెందిన కూలీలే అని డిఎన్ఎ పరీక్షల్లో నిరూపణ అయింది. మృతి చెందిన అబ్రర్ (20), ఇంతియాజ్ (25), ఇబ్రర్ అహ్మద్ (17) డిఎన్ఎలు వారి కుటంబ సభ్యుల నమూనాలతో సరిపోయినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని ప్రారంభం నుంచి విమర్శలు వస్తున్నాయి. షోపియాన్లో అద్దె కుంటున్న ప్రాంతం నుంచి ముగ్గురిని తీసుకుని వెళ్లి సైనికులు ఎన్కౌంటర్ చేసినట్లు స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆర్మీ సైనిక కోర్టు ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న సైనికులపై సైనిక చట్టాల కింద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కాగా, కుటంబ సభ్యుల నుంచి ఆగస్టు 13న డిఎన్ఎ నమూనాలను తీసుకున్న పోలీసులు, ఫలితాలను బహిరంగంగా విడుదల చేయడానికి 43 రోజలు సమయాన్ని తీసుకున్నారు.