Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాబితాలో ఎల్ఐసీ, జీఐసీ, న్యూఇండియా అస్యూరెన్స్
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగంలోని బీమా సంస్థలను ప్రయివేటుపరం చేయాలనీ, వాటిని కార్పొరేట్ల చేతిలో పెట్టాలని మోడీ సర్కారు చూస్తున్నా.. ప్రజలకు సేవలందించడంలో, పనితీరులో మాత్రం అవి ప్రయివేటు బీమా కంపెనీలకు చెక్ పెడుతూనే ఉన్నాయి. తాజాగా 2020-21 సంవత్సరానికి గానూ దేశీయంగా వ్యవస్థాగత ముఖ్యమైన సంస్థలు (డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్స్యూరర్స్-డీఎస్ఐఐఎస్) గా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ), న్యూ ఇండియా అస్యూరెన్స్ లు చోటు దక్కించుకున్నాయి. వీటిని భారతీయ బీమా నియంత్రణ, అభివద్ధి సంస్థ (ఐఆర్డీఎఐ) గుర్తించింది.
ఆయా సంస్థల కార్యకలాపాలు, వ్యవస్థాపగత ప్రాముఖ్యత దష్ట్యా.. ఈ సంస్థలు పారదర్శకతను పెంచి రిస్క్ మేనేజ్మెంట్ను తగ్గించాలని సూచించింది.
డీఎస్ఐఐఎస్లను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన పద్దతిని తయారుచేసినట్టు ఐఆర్డీఎఐ తెలిపింది. ప్రీమియం పూచికత్తు, నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ, ఆదాయ కార్యకలాపాలు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని మంచి పనితీరును కనబరిచిన సంస్థలకు గుర్తింపును అందజేస్తామని ఐఆర్డీఏఐ వివరించింది.