Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లు జీవిత కాలం కూడా లేని వాటికి కోట్ల ఖర్చా!
న్యూఢిల్లీ : 2002లో ప్రతిపాదించిన భారత వైమానిక దళానికి చెందిన 90 మీడియం లిఫ్టు మి-17 హెలికాప్టర్ల ఆధునీకరణ 18 ఏళ్ల తర్వాత అంటే 2020 నాటికి కూడా సాధ్యం కాలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తెలిపింది. తత్ఫలితంగా హెలికాప్టర్లు పరిమిత సామర్ధ్యంతోనే ఎగురుతున్నాయనీ, ఇది ఇన్ని సంవత్సరాలుగా కార్యచరణ సంసిద్ధతను రాజీ చేస్తుందని పేర్కొంది. హెలికాప్టర్ల ఆధునీకరణకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.223 కోట్ల రూపాయలు తగిన ఫలితం ఇవ్వదనీ, అది సమర్ధనీయం కూడా కాదని పేర్కొంది. 56 హెలికాప్టర్లలో పరిమిత జీవిత కాలం మాత్రమే మిగిలి ఉందని కాగ్ ఈ ఇటీవల పార్లమెంట్కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. 90 హెలికాప్టర్లను ఆధునీకరించేందుకు కేంద్ర రక్షణ శాఖ ఇజ్రాయిల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్తో రూ.618.23 కోట్లతో 2017, జనవరిలో ఒప్పందం చేసుకుంది. ఆధునీకరణ తర్వాత కూడా వీటిల్లో 56 హెలికాప్టర్లో రెండు సంవత్సరాల జీవిత కాలం మాత్రమే ఉంటుందనీ, దీంతో ప్రభుత్వం చేసిన రూ.223 కోట్ల ఖర్చు సమర్ధనీయం కాదని పేర్కొంది. ఈ 56 హెలికాప్టర్లు 2024 నాటికి దశలవారీగా వైమానిక దళం నుంచి తొలగించబడతాయి. అదనంగా ఆప్గ్రేడ్ కోసం హిందూస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్(హెచ్ఏఎల్), భారత్ ఎలక్రానిక్స లిమిటెడ్(బీఈఎల్)లు రూ.1,720 కోట్ల విలువైన అవసరమైన పరికరాలను సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకుగానూ రక్షణ శాఖ కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇప్పటికి 18 సంవత్సరాలుగా గడిచినా ఇంకా ఈ ఆధునీకరణ పూర్తి కాలేకపోయిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.