Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో 92 వేలు దాటిన మరణాలు
- ఐసీయూలో అసోం మాజీ సీఎం
- ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం తగ్గడంలేదు. రోజురోజుకూ వైరస్ బడారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరినీ వదలకుండా కరోనా మహమ్మారి బలి తీసుకుంటున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1,141 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 58,18,571కి చేరింది. మరణాల సంఖ్య 92,290కి పెరిగింది. ప్రస్తుతం 9,70,116 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 47,56,165 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 81.7శాతం, మరణాల రేటు 1.6 శాతానికి చేరింది. పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉంది. కాగా, దేశంలో ఇప్పటివరకూ మొత్తం 6,89,28,440 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 14,92,409 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
మనీశ్ సుసోడియా, తరుణ్ గోగోరుల
ఆరోగ్య పరిస్థితి విషమం
కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సుసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మంత్రికి కరోనా సోకగా హౌం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మూడు రోజుల క్రితం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆసుపత్రిలో చేరారు. తాజాగా, ఆయనకు డెంగ్యూ కూడా సోకిందనీ, బ్లడ్ ప్లేట్లెట్లు సైతం క్రమంగా పడిపోతుండటంతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణిస్తున్నదని వైద్యులు తెలిపారు. అలాగే, అసోం మాజీ సీఎం తరుణ్ గోగోరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. గత కొన్నిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గువహతిలోని మెడికల్ కాలేజీ హాస్పిటలోని (జీఎంసీహెచ్)లోని ఐసీయూకి తరలించారు. వైద్యానికి సంబంధించి జీఎంసీహెచ్ డాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎయిమ్స్ వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రథింపులు జరుపుతున్నారని అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా తెలిపారు. గత నెల 25న గోగోరుకి కరోనా నిర్ధారణ అయ్యింది.
తీహార్ జైలు డీజీకి కరోనా పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకిందని తీహార్ జైలు అధికారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈమధ్య కాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన తీహార్ జైలులో మొదటి కరోనా కేసు మే నెలలో వెలుగుచూసింది.
బెంగాల్ రవాణాశాఖ మంత్రికి కరోనా
ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వైరస్ బారినపడగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రవాణాశాఖ మంతి సువేందు అధికారికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హౌం ఐసోలేషన్లో ఉన్నారని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. ఆయన తల్లికి కూడా వైరస్ సోకిందని పేర్కొన్నారు. పుర్బా మదీనిపూర్ జిల్లాలోని నందిగ్రామ్కు చెందిన 49 ఏళ్ల ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని గెస్ట్హౌస్లో గహనిర్భందంలో ఉండగా.. ఆయన తల్లిని కోల్కతాలోని దవాఖానలో చేర్పించినట్టు సదరు అధికారి తెలిపారు. ఇంతకు ముందు బెంగాల్లో మంత్రులు సుజిత్ బోస్, జ్యోతిప్రియో ముల్లిక్, స్వాపన్ దేబ్నాథ్ మహమ్మారి బారినపడగా కోలుకున్నారు.