Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఒకవైపు కరోనా కోరలు చాచు తున్నా.. మరోవైపు బీహార్ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో నిర్వహించనున్న ఈ ఎన్నికలు వచ్చేనెల 28న మొదలుకానున్నాయి. నవం బర్ 3న రెండో విడత, 7న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఓట్ల కౌంటింగ్తో పాటు ఫలితాలూ వెలువడనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 243 శాసనసభ నియోజకవర్గాలున్న బీహార్లో.. 38 స్థానాలు ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వ్డ్ అయ్యాయి.
పోలింగ్ ఇలా....
38 జిల్లాలున్న బీహార్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తొలిదశలో అక్టోబర్ 28న (16 జిల్లాల్లో) 71శాసనసభ నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. ఇవి వామపక్ష తీవ్రవాద ప్రభా వం ఉన్న జిల్లాలు. ఇందుకోసం 31 వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
రెండో దశ పోలింగ్.. (17 జిల్లాల్లో) 94 నియోజకవర్గాల్లో జరగనుంది. ఇందుకోసం 42వేల పోలింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఇక చివరిదైన మూడోదశలో.. (15 జిల్లాల్లో) 78 నియోజకవర్గాల్లో 33,500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. పది జిల్లాల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశ పోలింగ్కు వచ్చే నెల మొదటినుంచి నామినేషన్ల ప్రక్రియ మొద లు కానున్నది. 8నాటికి నామినేషన్లు వేయడానికి, 12 వ తేదినాటికి ఉపసంహరణకు గడువుఉన్నది. సీఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుం చే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, భారీ ర్యాలీ లకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే చేసుకోవాలి.
అతి పెద్ద ఎన్నికలు ఇవే....
ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా.. ప్రపంచవ్యాప్తం గా జరుగుతున్న పెద్ద ఎన్నికలు ఇవేనని సునీల్ అరోరా అన్నారు. రోజులు గడుస్తున్నా మహమ్మారి అదుపులోకి వచ్చే సంకేతాలేమీ కనిపించడం లేదనీ, దీంతో ప్రజలకు వారి ప్రజాస్వామ్య హక్కులను విన యోగించుకునే అవకాశం కల్పించడానికే ఈ నిర్ణ యానికి వచ్చామని తెలిపారు.
నాయకులు ఓటర్లతో భారీ ర్యాలీలకు అనుమతి లేదనీ, భౌతిక దూరం నిబంధనలు పాటించాలని స్పష్టంచేశారు. ఆన్లైన్ ర్యాలీలకు మాత్రం అవకాశమిచ్చామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు వారి నేర రికార్డులను టీవీలు, పత్రికలలో తప్పనిసరిగా ప్రచురించాలనీ, సోషల్మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు పెట్టొద్దని ఆయన సూచించారు.