Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలు కన్నుమూత.. మూగబోయిన గానం..
- చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్తమయం
- విషాదంలో సంగీత ప్రపంచం
- నేడు చెన్నైలో అంత్యక్రియలు
చెన్నై : సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడి గాత్రం మూగబోయింది. శ్రీపతి పండితారాథ్యుల బాల సుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఎక్మో,వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. గురువారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శుక్రవారం మధ్యాహ్నం వెంటి లేటర్పైనే బాలు తుది శ్వాస విడిచారు. కాగా, కొన్ని రోజుల కిందట కరోనా నెగెటివ్ రావడంతో ఎస్పీబీ కోలుకుంటున్నారనీ, పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని అభిమానులంతా భావించారు. ఆరోగ్యపరిస్థితి విషమించటంతో.. ఆయన శక్రవారం ఒంటి గంట సమయంలో మరణించినట్టు బాలు కుమారుడు చరణ్ మీడియా ముందు వచ్చి ధ్రువీకరించారు. సంగీత యోధుడు, గాన గంధర్వుడి మరణంతో యావత్ సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
కరోనాపై ప్రత్యేక గీతం..
ప్రపంచంలో కల్లోలం సష్టించిన కరోనా విలయంపై ప్రత్యేక గీతం ఆలపించిన బాలు... అదే కరోనాతో ఆస్పత్రి పాలు కావడం.. కరోనాను జయించడం మళ్లీ అనారోగ్యంపాలై చివరికి కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
నేడు అంత్యక్రియలు..
బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎస్పీచరణ్ నివాసానికి బాలు పార్ధి వదేహాన్ని తరలించారు.శనివారం మధ్యాహ్నం వరకు అభిమానులసందర్శనార్థం అక్కడ ఉం చుతారు. శనివారం చెన్నై శివారులోని తమరై పాక్యంలోఅంత్యక్రియలు నిర్వహించనున్నారు.