Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనావైరస్పై పోరుకోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ప్రధానమంత్రి పౌరుల సాయం, అత్యవసర పరిస్థితుల సహాయ నిధి (పీఎం కేర్స్)కి భారీ విరాళాలు అందాయి. ఇందులో రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 15 ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలోని ఉద్యోగుల జీతాల నుంచి ఈ నిధికి రూ.204.75 కోట్లు విరాళాలు వచ్చాయి. ఆర్బీఐ రూ.7.34 కోట్లు విరాళం ఇవ్వగా, ఎస్బీఐ రూ. 107.95 కోట్లు, కెనరా బ్యాంకు రూ.15.53, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14.81 కోట్లు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రూ. 9.04 కోట్లు, తమ ఉద్యోగుల జీతాల్లో నుంచి విరాళంగా ఇచ్చింది. సీఎస్ఆర్, ఎల్ఐసీ, జీఐసీతో పాటు నేషనల్ హౌసింగ్ బ్యాంకు కలిపి రూ. 144.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఒక్క ఎల్ఐసీనే రూ.113.63 కోట్లు విరాళంగా ఇచ్చింది, అందులో ఉద్యోగుల జీతాల్లో నుంచి రూ.8.64 కోట్లు, రూ.100 కోట్లు కార్పొరేట్ కమ్యూనికేషన్ కింద, గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కింద రూ. 5 కోట్లు ఇచ్చింది. మొత్తంగా, ఈ 15 ప్రభుత్వ బ్యాంకులు, సంస్థల నుంచి ఉద్యోగుల జీతాలు సహా పీఎం కేర్స్ ఫండ్కు రూ.349.25 కోట్లు అందినట్టు పీఎం కేర్స్ ఫండ్ ఖాతాకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది మార్చిలో రూ.3,076.62 కోట్ల కార్పస్ నిధితో పీఎంకేర్స్ను ఏర్పాటుచేయగా, అందులో రూ.3,075.85 కోట్లు 'స్వచ్ఛంద సహాయం'గా అందినట్టు దాని అధికారిక వెబ్సైట్లో తెలిపారు. నిధుల దాతల వివరాలను వెల్లడించేందుకు ప్రధాని కార్యాలయం నిరాకరించిన విషయం తెలిసిందే. ఇది ఆర్టీఐ చట్ట పరిధిలోకి రాదనీ తెలిపింది.