Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను తిరస్కరించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని బిజెపియేతర రాష్ట్రాలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ప్రకారం కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా తమ రాష్ట్రాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని, రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు అనంతరం రాష్ట్రపతి దగ్గరకు వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ ట్వీట్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు హేయమైనవని తెలిసేలా రాష్ట్రాలు చట్టాలను రూపొందించాలని, అవి రాష్ట్రపతి అనుమతి పొందితే ఆ చట్టాలను ఆ రాష్ట్రానికి వర్తించేలా చేయవచ్చని సోనియాగాంధీ పేర్కొన్నారు.